వికారాబాద్ : కార్పొరేట్ దవాఖానలో వైద్యం చేయించుకున్న పేదలకు సర్కారు సహాయం అందజేస్తూ అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని తన నివాసంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఓవైపు సర్కారు దవాఖానల పటిష్టానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటూనే ప్రైవేటులో వైద్యం చేయించుకున్న వారికి సీఎంఆర్ఎఫ్ కింద సర్కారు ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని చెప్పారు.
ప్రతి సంవత్సరం వేలాది మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, బి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
పురుగుల మందు తాగి ఆర్ఎంపీ డాక్టర్ మృతి
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
లావైపోయాను.. కాపురానికి పనికిరానా?
మరియమ్మ కుమారుడికి డీజీపీ పరామర్శ