ఖమ్మం : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో మృతి చెందిన మరియమ్మ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ అండగా ఉంటాయని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని దవాఖానలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని డీజీపీ కలిసి పరామర్శించారు. మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడిన డీజీపీ.. మరియమ్మ మృతి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. మరియమ్మ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆత్మగౌరవం, ప్రాణాలకు భంగం కలగకుండా నడుచుకుంటామన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ను కొనసాగిస్తామని పేర్కొన్నారు. మరియమ్మ మృతికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నేరస్థులను పట్టుకునే క్రమంలో పోలీసులు, సిబ్బంది సంయమనంతో వ్యవహరించాలని పోలీసులకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
పురుగుల మందు తాగి ఆర్ఎంపీ డాక్టర్ మృతి
మళ్లీ పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు
లావైపోయాను.. కాపురానికి పనికిరానా?