రంగారెడ్డి : కటుంబ కలహాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు గగన్ పహాడ్కు చెందిన వేణుగోపాల్ గౌడ్ అనే ఆర్ఎంపీ డాక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివవారాలు తెలియాల్సి ఉంది.