హైదరాబాద్ : కొవిడ్ బారిన పడిన మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు కరోనాను జయించారు.
ఈ నెల 6 తేదీన మంత్రి సతీమణి స్నేహలతకు పాజిటివ్ నిర్ధారణ కాగా 9వ తేదీన మంత్రి కొప్పులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరారు. చికిత్స పొందిన అనంతరం ఈశ్వర్ దంపతులు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు.
వైద్యుల సలహా మేరకు మినిస్టర్స్ క్వార్టర్స్లో తన నివాసంలో హోం ఐసోలేషన్లో ఉంటున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా మహమ్మారిని జయించడానికి నాకు ధైర్యం ఇచ్చింది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే అని మంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
దార్శనికుడు బసవేశ్వరుడు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనుల పరిశీలన