పెద్దపల్లి : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) విజయాన్ని కాంక్షిస్తూ ఓ కార్యకర్త వినూత్న రీతిలో ప్రచారం (Innovative campaign)నిర్వహిస్తున్నాడు. జిల్లా కేంద్రంలో(Peddapalli) బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా సిద్దిపేట జిల్లా చేర్యాల గ్రామానికి చెందిన గజబీమ్ కార్ మనోహర్ అనే వ్యక్తి పూర్తిగా గులాబీ వస్త్రధారణ, చేతిలో హ్యాండ్ మైక్ పట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. కాలినడకనే జిల్లా కేంద్రం అంతా కలియ తిరుగుతూ, మైకు ద్వారా పాటలు వినిపిస్తూ ప్రచారం చేస్తున్నాడు. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్కు బహుమానంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. మనోహర్ ప్రచారం ఓటర్లను ఎంతో ఆకట్టుకుంటున్నది.