పాపన్నపేట, ఆగస్టు 11 : గ్రామపంచాయతీలో కారోబారుగా విధులు నిర్వహిస్తున్న ఆకుల కృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం బాధాకరమని మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో కృష్ణ మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న పద్మాదేవేందర్రెడ్డి మంగళవారం పాపన్నపేట గ్రామానికి చేరుకుని కృష్ణ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం కృష్ణ భార్యను ఓదార్చి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
కృష్ణ కూతురిని ఎత్తుకొని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆమె వెంట పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు సోములు, మాజీ సర్పంచ్లు గురుమూర్తి గౌడ్, లింగారెడ్డి, నాయకులు కాశీనాథ్ రావు, ఉప్పరి వెంకటేశం, రంగంపేట శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.