వరంగల్ రూరల్ : జిల్లాలోని గీసుకొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో గణేశా ఈకో టెక్ ప్రవేట్ లిమిటెడ్, గణేశా ఈకో పెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు చేపట్టిన ఫ్యాక్టరీల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ.. 20 ఎకరాల స్థలంలో 6 యూనిట్లుగా విభజించి గణేశా ఈకో టెక్ ప్రవేట్ లిమిటెడ్, గణేశా ఈకో పెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నిర్మాణం చేపట్టాయన్నారు. మొదటి యూనిట్ ఈ సంవత్సరం డిసెంబర్ లోగా ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్