మహబూబ్నగర్ : కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు లాక్ డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప జనం బయటికి రావద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో లాక్ డౌన్ సందర్భంగా రోడ్ల పైకి వచ్చిన వాహనాలను మంత్రి , స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆపి వాహనదారులతో మాట్లాడారు. లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఉదయం 6గం. నుంచి 10 గం వరకు నిత్యావసర వస్తువులు, ఇతర అవసరాలు తీర్చుకోవాలన్నారు. కరోనా విస్తరించకుండా ప్రజలు తోడ్పాటు అందించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత