మహబూబ్నగర్ : బహుజన వర్గాలను రాజ్యాధికారానికి చేరువ చేసిన మొట్టమొదటి దార్శనికుడు శరణ బసవేశ్వరడని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బసవ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో ఉన్న శరణ బసవేశ్వరుడి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాటి సమాజంలో పేరుకుపోయిన కుల వ్యవస్థను నిర్మూలించడానికి మనుషులందరూ ఈశ్వరుడి దృష్టిలో సమానమేనని వీరశైవ లింగాయత్ ధర్మాన్ని స్థాపించాడు. సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేయడమే కాకుండా కుల వ్యవస్థ నిర్మూలన కోసం ఎంతో శ్రమించినట్లు మంత్రి తెలిపారు.
నిమ్న వర్గాలు రాజ్యాధికారానికి అనర్హులనే జడత్వ భావన నాటి సమాజంలో రాజ్యమేలుతున్న పరిస్థితుల్లో శరణు బసవేశ్వరుడు ఒక రాజ్యాధినేతగా తన మంత్రివర్గంలో అనుభవ మంటపం పేరుతో అన్ని కులాల వారికి స్థానం కల్పించి శతాబ్దాల కిందటే సమసమాజ స్థాపన కోసం కృషి చేశారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ శరణు బసవేశ్వరుడి ఆశయ సాధన కోసం కంకణబద్ధులై ఉన్నట్లు మంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పుల్లూరు వద్ద నిలిచిపోయిన ఏపీ అంబులెన్స్లు
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు : మంత్రి సత్యవతి రాథోడ్
జోగులాంబ జిల్లాలో కర్నాటక సరిహద్దులు మూసివేత
అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పనుల పరిశీలన