మాదాపూర్, ఏప్రిల్ 26 : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gnaneshwar) గెలుపునకు ప్రతి ఒక నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా ఎమ్మెల్యే పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని గంగారం విలేజ్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్చంద్రాబోస్ నగర్ కాలనీలో పాదయాత్ర చేసి బీఆర్ఎస్ పార్టీ కరపత్రాలను ఇంటింటికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెవెళ్ళ గడ్డపై కాసానిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్కు కానుకగా అందిద్దామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తు వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయలేదని, ప్రజలను ఉచిత హమీలతో మభ్యపెట్టే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.