అగ్నిప్రమాదాల నేపథ్యంలో రైల్వేశాఖ నిర్ణయం
న్యూఢిల్లీ, మార్చి 30: అగ్నిప్రమాదాల నివారణకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రైళ్లలో ఇకపై రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్య ఎలక్ట్రానిక్ పరికరాలకు చార్జింగ్ పెట్టేందుకు ప్రయాణికులను అనుమతించకూడదని నిర్ణయించింది. పశ్చిమ రైల్వే ఇప్పటికే దీనిని అమలుచేస్తున్నది. రాత్రి సమయంలో చార్జింగ్ పోర్ట్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నది. 2014లో బెంగళూరు-హజూర్ సాహిబ్ నాందేడ్ ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం అనంతరం రైళ్లలో చార్జింగ్ బోర్డులను స్విచ్ఛాఫ్ చేయాలని రైల్వే భద్రతా కమిషనర్ సిఫార్సు చేశారు.
ఇవి కూడా చదవండి:
పాముల్లా మనుషులు విషాన్ని చిమ్ముతారా?
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’
బీహార్లో 2 అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లల సజీవ దహనం
రాష్ట్రపతికి గుండె శస్త్రచికిత్స
అమ్మాయిలూ.. రాహుల్తో జాగ్రత్త!
ఎయిర్పోర్టుల్లో మాస్కులు ధరించకపోతే అక్కడే ఫైన్