న్యూఢిల్లీ, మార్చి 30: ఖలునకు నిలువెల్లా విషము గదరా సుమతీ.. దుష్టుల గురించి బద్దెన చెప్పిన ఈ మాట మానవుల గుణానికి సంబంధించినదే అయినా కాలగమనంలో అందరు మనుషులు పాముల వలె నిజంగానే విషాన్ని చిమ్ముతారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుకు తగ్గ ఆధారాలను కూడా చూపిస్తున్నారు. విషపూరిత సరీసృపాల్లో లాలాజల గ్రంథులే విషగ్రంథులుగా మారి ఉంటాయని శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా ఊహిస్తూ వస్తున్నారు.
దానికి బలం చేకూర్చే ఆధారాలను ఓకినావా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ వర్సిటీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. వారు తమ అధ్యయనంలో భాగంగా తైవాన్ హబూ పాముపై పరిశోధనలు జరిపారు. విషగ్రంథుల్లో విషం ఎలా ఏర్పడుతుందన్న విషయాన్ని పరిశీలించారు. విషం ఏర్పడటానికి కొన్ని రకాల ప్రత్యేకమైన జన్యువులు ఒకదానితో ఒకటి సమన్వయం కావడాన్ని గుర్తించారు. ఆశ్చర్యకరంగా అలాంటి జన్యు ప్రక్రియనే మనుషుల్లోనూ గుర్తించారు. అలాగే పాముల్లో విష గ్రంథులు, మనుషుల్లో లాలాజల గ్రంధుల మధ్య సారూప్యత గమనించారు. దీన్ని బట్టి కొన్ని వేల సంవత్సరాల్లో మనిషిలో కూడా పాములాగా విషగ్రంథులు ఏర్పడతాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
కమ్యూనిస్టుల ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’
బీహార్లో 2 అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లల సజీవ దహనం
రాష్ట్రపతికి గుండె శస్త్రచికిత్స
అమ్మాయిలూ.. రాహుల్తో జాగ్రత్త!
ఎయిర్పోర్టుల్లో మాస్కులు ధరించకపోతే అక్కడే ఫైన్
రైళ్లలో రాత్రిపూట చార్జింగ్ బంద్