న్యూఢిల్లీ, ఆగస్టు 3: కర్ణాటక క్యాబినెట్ విస్తరణ వేళ అధికార కాంగ్రెస్లో అసమ్మతి చిచ్చు రాజుకుంది. క్యాబినెట్ విస్తరణలో తమకు చోటు దక్క లేదన్న అసంతృప్తితో సోమవారం ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఇండీ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశ్వంత్రాయగౌడ, సాగర్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బేలూర్ గోపాలకృష్ణ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
తనకు మంత్రి పదవి ఇస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో పార్టీ విఫలమైందని పాటిల్ విమర్శించగా మాజీ ముఖ్యమంత్రుల పిల్లలకే కాంగ్రెస్లో ప్రాధాన్యత లభిస్తున్నదని గోపాలకృష్ణ ఆరోపించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకు డీకే మంత్రివర్గాన్ని విస్తరించారు. క్యాబినెట్లో 19 మందికి చోటు కల్పించారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. అసంతృప్త ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై డీకే స్పందిస్తూ, ‘ఇంత కుముందు సిద్ధరామయ్య క్యాబి నెట్లో నాకూ మంత్రి పదవి దక్కలేదు. అర్హు లైన వారు చాలామంది ఉన్నా..అందరికీ చోటు కల్పించలేం కదా!’ అని అన్నారు.