TS Ministers Protest | బీజేపీ కుట్రలను నిరసిస్తూ చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ విజయవాడ హైవేపై టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. మంత్రులు గుంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డిపై బైఠాయించి నిరసనలు తెలిపారు. నిఖార్సయిన తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించిన బీజేపీవి దుష్టచర్యలని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దుర్మార్గపు చర్యలతో రాజ్యాంగాన్ని బీజేపీ అవమానిస్తుందని ఈ సందర్బంగా మండిపడ్డారు. మోదీ, రాజ్గోపాల్ రెడ్డి, బీజేపీ అనైతిక నీచ విధానాలను ఎండగడుతూ తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు. బీజేపీ డౌన్ డౌన్, మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. టీఆర్ఎస్ శ్రేణుల ధర్నాతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్ద బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలిపారు. మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
మునుగోడు ఎన్నికల్లో గెలిచే సత్తాలేని బీజేపీ.. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకుంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి దొరికిపోయింది. మొయినాబాద్కు సమీపంలోని ఓ ఫామ్హౌస్లో సైబరాబాద్ పోలీసులు జరిపిన దాడిలో ముగ్గురు పట్టుబడ్డారు. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజులు, హైదరాబాద్కు చెందిన నందకుమార్ ఉన్నారు. వీరి దగ్గర నుంచి రూ.15 కోట్ల నగదును సీజ్ చేశారు.