మునుగోడు ఎన్నికల్లో గెలిచే సత్తా లేని భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకుంది. ఈ క్రమంలోనే డబ్బు ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసి పోలీసులకు దొరికిపోయింది. నలుగురు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ స్కెచ్.. పోలీసులకు దొరికిపోయిన బీజేపీ నేతలు.. కోట్లలో డబ్బు స్వాధీనం pic.twitter.com/ej55ydMSY2
— Namasthe Telangana (@ntdailyonline) October 26, 2022
నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసింది. వీరు భారీగా డబ్బులు ఎర వేసేందుకు ప్రయత్నిస్తూ హైదరాబాద్లో పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.
పట్టుబడిన వారిలో బీజేపీ నేతలు రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ ఉన్నారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి అజీజ్ నగర్లోని పీవీఆర్ ఫామ్ హౌస్లో కోట్లలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాసేపట్లో దీనికి సంబంధించిన వివరాలను పోలీసులకు ప్రెస్మీట్లో కాసేపట్లో వివరించనున్నారు.
పోలీసులకు దొరికిపోయిన వారిలో దక్కన్ ప్రైడ్ హోటల్ యజమాని నందకుమార్ కూడా ఉన్నారు. ఈయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని సమాచారం. స్వామి రామచంద్రభారతి ఢిల్లీ నుంచి రాగా, సింహయాజులు తిరుపతికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతో రైడ్ చేసినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని ప్రలోభపెడుతున్నట్లు ఎమ్మెల్యేలు సమాచారమిచ్చినట్లు వెల్లడించారు. వీరి సమాచారంతోనే ఫామ్హౌజ్పై రైడ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఫరీదాబాద్కు చెందిన రామచంద్రభారతి అలియాస్ సతీశ్ శర్మ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని, ఆ సమయంలో తిరుపతి నుంచి వచ్చిన స్వామిజీ సింహయాజులు, హైదరాబాద్కు చెందిన నందకుమార్ రామచంద్రభారతితో ఉన్నారని స్టీపెన్ రవీంద్ర వివరించారు. వీరు ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నట్టు తెలిసిందన్నారు. దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని సీపీ పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని అన్నారు.