CM KCR | పేదలకు గృహ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని.. దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎంతో వ్యయంతో, అన్ని వసతులతో అందంగా నిర్మించిన ఈ ఇండ్లను పేదలకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇచ్చే పథకం మరెక్కడా లేదని అన్నారు. దేశంలో ఎక్కడా పేదల కోసం ఇటువంటి ఇండ్ల నిర్మాణం జరగడం లేదన్నారు. కొల్లూరులో 124 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల సముదాయం ఓ టౌన్ షిప్ ను తలపించేదిగా ఉందని చెప్పారు. ఇక్కడ 117 బ్లాకుల్లో 15,660 ప్లాట్లు నిర్మించామని.. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని తెలిపారు. పేదలకు గృహ నిర్మాణం అనేది ఓ నిరంతర ప్రక్రియ అని దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. పేదలు ఎవరైనా తమ సొంత జాగాలో ఇళ్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మీ పథకం కింద పథకం రూ.3లక్షలు అందిస్తుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ 3వేల మందికి గృహలక్ష్మీ పథకం ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి
“CM KCR | ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచే దోపిడీకి గురైన తెలంగాణ: సీఎం కేసీఆర్”