హైదరాబాద్: తౌక్టే తుఫాన్ కారణంగా గుజరాత్ వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) రద్దుచేసింది. తుఫాను ప్రభావంతో గుజరాత్ కోస్తా తీరంలో ఏర్పడిన పరిస్థుల వల్ల ఆరు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. నేడు నడవాల్సిన పూరి-ఓఖా ఎక్స్ప్రెస్, 17న నడిచే రాజ్కోట్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-రాజ్కోట్ ఎక్స్ప్రెస్లు, 18న నడిచే పోరుబందర్-సికింద్రాబాద్, 19న బయలుదేరే ఓఖా-పూరి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-పోరుబందర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18న నడవాల్సిన ఓఖా-రామేశ్వరం రైలును పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి