హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ కలిశారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణించిన వారికి, శాశ్వత అంగవైకల్యం చెందిన కార్మికులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్స్ గ్రేషియో, ద్విచక్రవాహనాలు (మోపెడ్) పంపిణీ చేయాలని వినతిపత్రం సమర్పించారు.
గౌడ సంఘాల ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే గీత కార్మికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో నిధులను విడుదల చేస్తామన్నారు.
కార్యక్రమంలో జేఏసీ కో చైర్మన్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ల వేములయ్య గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బబ్బురి భిక్షపతి గౌడ్, తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షులు నాచగోని రాజయ్య గౌడ్, వంగాల బాలరాజ్ గౌడ్, ఆర్ సంజయ్ గౌడ్, అఖిల భారత గౌడ సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బండారం అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం