నల్లగొండ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కట్టుకున్న భార్యతను కిరాతకంగా నరికి చంపి ఆపై తను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన మాడుగులపల్లి మండల కేంద్ర శివారు బత్తాయి తోటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు ఒడిషాకు చెందిన జగన్, స్వాతి భార్యభర్తలు. బతుకు దెరువు కోసం వచ్చి స్థానికంగా ఒక తోటలో పని చేస్తున్నారు. మాడ్గులపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా