న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తన ఉద్యమంలో విజయవంతమైన దరిమిలా, ఇప్పుడు ఇంధన అంశంపై మరో సరికొత్త ఉద్యమం తెరపైకి వచ్చింది. ‘ఈ20 జనతా పార్టీ’ పేరుతో మొదలైన ఈ క్యాంపెయిన్లో పెట్రోల్ బంక్లలో ఈ20 ఇంధనంతో పాటు 100 శాతం శుద్ధమైన పెట్రోల్ను కూడా విక్రయించేలా చూస్తూ, వినియోగదారులకు ఎంపిక హక్కును ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
‘ఎక్స్’ వేదికగా మలేషియా కేంద్రంగా పనిచేస్తున్నట్లుగా ఉన్న ‘ఈ20 జనతా పార్టీ’ తాము ఇంధనంలో ఇథనాల్ కలపడానికి వ్యతిరేకం కాదని, ప్రత్యామ్నాయాలు లేకపోవడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాహనాల ట్యాంకుల్లో ఏ ఇంధనం వేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను వినియోగదారులకే వదలాలన్నదే తమ డిమాండ్ అని తెలియజేసింది.