పెద్దపల్లి : ప్రజారక్షణే ధ్యేయంగా పోలీసులు పని చేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి సూచించారు. ప్రజల వద్దకు పాలనే లక్ష్యంగా కేసీఆర్ ముందు చూపుతో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసి పోలీస్ శాఖతోపాటు ఇతర కలెక్టరేట్లకు ఆధునిక భవనాలను ఏర్పాటు చేశారనీ, దేశంలోఎక్కడా లేనివిధంగా వీటిని నిర్మించారని పేర్కొన్నారు. గోదావరిఖనిలో రూ.16 కోట్లతో నిర్మిస్తున్న కమిషనరేట్, రూ.3.5 కోట్లతో నిర్మిస్తున్న పోలీస్ ఆధునిక విశ్రాంతి భవనం, మోడల్ పోలీస్స్టేషన్ను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్తో కలిసి పరిశీలించారు.
అనంతరం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్స్టేషన్ నూతన పోలీస్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. భవనాలకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది తమవంతు బాధ్యతగా తన పనితీరును మార్చుకొని ప్రజా రక్షణే ధ్యేయంగా పని చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి పోలీస్స్టేషన్లో 33 శాతం మహిళా రిజర్వేషన్, సాయుధ బలగాల్లో 10 శాతం మహిళా రిజర్వేషన్ కల్పించామన్నారు.
రానున్న రోజుల్లో పోలీస్స్టేషన్లలో సిబ్బందిని పెంచుతామన్నారు. 18వేల నూతన పోస్టులను సైతం మంజూరు చేస్తామన్నారు. కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనులు చేస్తున్నారన్నారు. అనంతరం పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ శ్రీనివాస రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు, నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ సీఈ విజయ్కుమార్, ఈఈ శ్రీనివాస్, రామగుండం సీపీ సత్యనారాయణ, ఐపీఎస్ అధికారులు నికితా పంత్, శరత్ చంద్రతోపాటు రెండు జిల్లాల డీసీపీలు రవీందర్, ఉదయ్ కుమార్ రెడ్డితోపాటు ఏసీపీ, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ఇసుక అక్రమ రవాణాను తక్షణమే అరికట్టాలి