మహబూబ్నగర్ : ఇసుక అక్రమ రవాణాను తక్షణమే అరికట్టాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి ఇసుక సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన ఇసుక వాహనం ద్వారా తప్ప ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతులు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదని, అయినప్పటికి జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఇకపై జిల్లా నుంచి పిడికెడు ఇసుక కూడా అక్రమంగా రవాణా కావటానికి వీలు లేదని అన్నారు. కేవలం మన ఇసుక వాహనం అనుమతి ఉన్న ఇసుక మాత్రమే రవాణా చేయాలని,అలా కాదని ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే తక్షణమే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇసుక సరఫరా కోసం “ మన ఇసుక వాహనం” యాప్ ద్వారా, టీఎస్ ఎంఐడీసీ ద్వారా, ప్రభుత్వ నిర్మాణాలకు, గృహ నిర్మాణాలకు మూడు రకాల అనుమతులు ఇస్తున్నామనిత తెలిపారు.
ఇసుక అక్రమ రవాణా కాకుండా చూడటంలో తహసీల్దార్లు పూర్తి పట్టు కలిగి ఉండాలన్నారు. పోలీసు రెవెన్యూ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా బాలానగర్, రాజాపూర్, మహబూబ్నగర్ రూరల్ తదితర ప్రాంతాల నుంచి ఫిల్టర్ ఇసుక రవాణా అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దీనిని కూడా తక్షణమే నిరోధించాలన్నారు.
లేనట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకుఎస్సైలు, తహసీల్దారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం