Hyderabad | ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన యువతిని ఓ ఇన్స్పెక్టర్ మాయమాటలతో లొంగదీసుకున్నాడు. ఆమెతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటకు రాకూడదని బలవంతంగా అబర్షాన్ కూడా చేయించాడు. అనంతరం డబ్బులు కావాలంటూ యువతిని వేధించి రూ. రెండు కోట్ల వరకు వసూలు చేశాడు. చివరకు బాధితురాలు డీజీపీకి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ వ్యవహారం రెండేళ్లుగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న సదరు ఇన్స్పెక్టర్ గతంలో మరో పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు యువతితో పరిచయం ఏర్పడింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువతితో మాటలు కలిపి ఆమెకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత శారీరకంగా లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటకు రాకూడదని బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు.
అప్పటి నుంచి సదరు యువతిని వేధించడం మొదలుపెట్టాడు. తన ప్రైవేటు, లైంగిక వీడియోలను చిత్రీకరించిన ఇన్స్పెక్టర్ వాటిని బయటపెడతానంటూ బ్లాక్మెయిల్కు దిగాడు. బెదిరింపులకు పాల్పడుతూ ఇప్పటివరకు రూ.2 కోట్లు వసూలు చేశాడు. అయినప్పటికీ అతని వేధింపులు ఆగకపోవడంతో చివరకు బాధితురాలు డీజీపీ సీవీ ఆనంద్ను ఆశ్రయించింది. ఇన్స్పెక్టర్ వేధింపుల గురించి ఫిర్యాదు చేసింది.