మహబూబాబాద్: కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారి డయాలసిస్ సేవలను ప్రభుత్వం విస్తృతంగా అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన డయాలసిస్ విభాగాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డయాలసిస్ అవసరమైనవారు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, డబ్బు ఖర్చు చయాల్సి అవసరం లేకుండా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగానికి బలం చేకూరుస్తున్నామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి