న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కాస్త తగ్గు ముఖం పట్టింది. వరుసగా నాలుగో రోజు 3 లక్షలలోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,81,386 మంది వైరస్ బారినపడ్డారు. 3,78,741 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా 4,106 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ కేసులు 2,49,65,463కు పెరిగాయి. 2,11,74,076 మంది కోలుకున్నారు. ఇంకా 35 లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం 2.74 లక్షల మందికిపైగా మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 15.73 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. ఇప్పటివరకు 18 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ వేసినట్లు స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.