ఇండోర్: ఆ ముగ్గురూ టీనేజీ కుర్రాళ్లే. ఎక్కడికైనా ముగ్గురు కలిసే వెళ్లేవారు. ఏది చేసిన కలిసే చేసేవాళ్లు. అయితే వారిలో ఒక పిల్లవానికి.. తన ఇద్దరు స్నేహితులు చెడు అలవాట్ల వైపు వెళ్లడం నచ్చలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న ఆ ఇద్దరు యువకులు అతన్ని చంపేశారు. అంతేకాదు అతన్ని ఓ క్వారీలో పూడ్చిపెట్టి తమకు ఏమీ తెలియనట్లు మిన్నకుండిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రత్లామ్లో జరిగింది.
రత్లామ్ జిల్లాలోని దయాల్పురా అనే ఊర్లో ముగురు స్నేహితులు ఉన్నారు. వారిలో ఇద్దరు 16 ఏండ్ల వయస్సు కలిగినవారు కాగా, మరొక బాలుడికి 15 ఏండ్లు. ముగ్గురూ ఆడుకోవడం, కలిసి తిరగడం వంటివి చేసేవారు. రాత్రి పొద్దుపోయేవరకు ఫోన్లలో ఆటలాడటం వారికి పరిపాటిగా మారింది. ఈ క్రమంలో వారు చెడు వ్యసనాలపైపు మల్లారు. ఇది నచ్చని 15 ఏండ్ల పిల్లాడు.. ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు వారి అలవాట్లను గురించి చెప్పాడు. దీంతో అతనిపై ఆగ్రహంతో ఉన్న వారు సమయం చూసుకుని గత శుక్రవారం అతన్ని హత్యచేశారు. అనంతరం అతని మృతదేహాన్ని సమీపంలోని గనిలో పాతిపెట్టారు. తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో వారు మిగిలిన ఇద్దరు స్నేహితులపై దృష్టిసారించారు. పోలీస్ మార్కు విచారణతో వారు అసలు విషయం బయటపెట్టారు. తమ గురించి ఇంట్లో చెప్పడంతోనే అతన్ని చంపినట్లు చెప్పారని పోలీసులు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి