పెద్దపల్లి : పుట్టుకతోనే దివ్యాంగురాలైన ఓ యువతికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేయూతనిచ్చారు. ట్రై సైకిల్ లేక ఇబ్బందులు పడుతున్న సదరు యువతి సమస్యను గంటల్లోనే తీర్చి తన సహృదయతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన మానుపాటి రమాదేవి పుట్టుకతోనే దివ్యాంగురాలు. బుధవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి ట్రై సైకిల్ మంజూరు చేయమని కోరగా మంత్రి తక్షణమే స్పందించారు. పెద్దపల్లి జిల్లా వికలాంగులు శాఖ అధికారులుతో మాట్లాడి గంటల వ్యవధిలో ట్రై సైకిల్ అందించారు. సమస్యపై మానవీయంగా స్పందించి చేయూతనందించిన మంత్రికి రమాదేవి కటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వీసీ సీతారామారావు
తెలంగాణ.. రైతు సంక్షేమ రాష్ట్రం : మంత్రి పువ్వాడ