సంగారెడ్డి : గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం మాదారం పంచాయతీ దువ్వగుంట గ్రామంలో రూ.34లక్షల సొంత నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు సొంత నిధులతో దువ్వగుంట నుంచి జానకంపేట గ్రామం వరకు సుమారు కిలోమీటరు దూరం సీసీ రోడ్డు వేయిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ కొత్త పథకాలు పెట్టి ప్రజలకు చేరువ చేశారని అన్నారు. గ్రామ పంచాయతీలకు నెలనెల నిధులు విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాలలో నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంప్యార్డులు ఏర్పాటు చేసి పారిశుద్య గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలలో అందరు భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ సరిత, జిన్నారం ఎంపీటీసీ వెంకటేశంగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’