ఖమ్మం : సింగరేణి మండలం విశ్వనాధపల్లి గ్రామంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి తొలుత గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని నిర్మిస్తున్న వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన ఆయా పనులు పూర్తి చేసి వాడుకలోకి తేవాలని అధికారులను ఆదేశించారు.