ఇస్లామాబాద్, జూలై 29: బలూచిస్థాన్లో పాకిస్థాన్ సైన్యం అరాచకాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. తాజాగా అక్కడ ఒక అమాయక బాలికను కాల్చి చంపిన పాక్ సైనికులు హమాస్ ైస్టెల్లో ఆమె మృతదేహాన్ని ఒక సాయుధ వాహనం ముందు భాగంలో ఉంచి వీధు ల్లో ఊరేగించారు. ఈ వీడియో ఎక్స్లో వైరల్ అయ్యింది.
బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా లలో గత కొన్ని ఏండ్లుగా పాకిస్థాన్ ఇలాంటి అరాచకాలకే తెగబడుతున్నది. పాకిస్థాన్ నుంచి వేరుపడి తమను తాము స్వతంత్రంగా బలూచిస్థాన్ ప్రకటించుకున్న కొన్ని వారాల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, పాకిస్థాన్ ప్రభు త్వం జూలై 5న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ను ప్రారంభించిన తర్వాత బలూచిస్థాన్ ప్రావిన్స్లో 88 మందిని హతమార్చింది.