ఖమ్మం : రైతు సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ దూసుకుపోతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కారేపల్లి మండలం విశ్వనాథపల్లి, తవిసిబోడు గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి పువ్వాడ, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ కర్ణన్తో కలిసి బుధవారం ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దశలవారీగా ఈ పథకం పేదల దరికి చేరుతుందన్నారు. ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పథకాలను ప్రవేశపెట్టిందని, వాటి ఫలాలను తెలంగాణ సమాజం అందుకుంటుందని అన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాలన్నీ అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
కరోనా సంక్షోభంలోనూ సంక్షేమం ఆగలేదని, సంక్షేమ పథకాలన్నింటినీ యథావిధిగా సీఎం కేసీఆర్ కొనసాగించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే స్థితికి ఎదిగిందన్నారు. లబ్ధిదారులను గృహ ప్రవేశం చేయించి మంత్రి స్వయంగా స్వీటు తినిపించడంతో లబ్ధిదారులు సంతోషంలో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి..
పారిశుధ్య పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ
జమ్మికుంటలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’
అందరి సహకారంతో గ్రామాల అభివృద్ధి
పరిగిని సుందరంగా తీర్చిదిద్దుదాం
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వీసీ సీతారామారావు