Commonwealth Games : కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళా బాక్సర్లు వరసగా స్వర్ణ పతకాలతో మెరుస్తున్నారు. పదోరోజు ప్రీతి పవార్ పసిడి పతకంతో శుభారంభమివ్వగా.. జాస్మినే లంబోరియా గోల్డ్ మెడల్తో సత్తా చాటింది. వీరిద్దరి విజయాలతో స్ఫూర్తి పొందిన సాక్షి చౌదరి(Sakshi Chaudhary), ప్రియా ఘంఘాస్ (Priya Ghanghas) సైతం పుత్తడి వెలుగులు విరజిమ్మారు. ఇప్పటివరకూ భారత్ గెలిచిన స్వర్ణాల సంఖ్య పదికి చేరింది. జుడోలో ఆశలు రేపిన ఉన్నాటి శర్మ కాంస్యంతో సరిపెట్టుకుంది.
గ్లాస్గోలో భారత బాక్సర్లు పతకాలతో పోడియం మీద మువ్వన్నెల జెండాను రెపరెపలాడిస్తున్నారు. పదో రోజుప్రీతి పవార్ పసిడి పతకం గెలిచిన వేళా విశేషం ఏంటోగానీ.. ఆతర్వాత వరసగా ఏకంగా మూడు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. మహిళల 54 కిలోల విభాగంలో ప్రీతి.. 57వ విభాగంలో రెచ్చిపోయిన జస్మినే సైతం స్వర్ణం పట్టేసింది. ఉత్తర ఐర్లాండ్కు చెందిన మైఖేల్ వాల్ష్కు ఏమాత్రం అవకాశమివ్వని భారత బాక్సర్ 5-0తో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది.
ప్రీతి పవార్, జాస్మినే లంబోరియా

అనంతరం.. సాక్షి చౌదరీ సైతం గోల్డెన్ పంచ్ విసిరింది. 51 కిలోల ఫైనల్లో సివంగిలా చెలరేగిన సాక్షి .. ఇంగ్లండ్ ఛాంపియన్ రూబీని 5-0తో చిత్తుగా ఓడించింది. ఏకపక్ష పోరులో ప్రత్యర్థికి ఊపిరి సలపనివ్వని సాక్షి దేశానికి తొమ్మిదో పసిడి అందించింది. కాసేపటికే కజిన్ సాక్షిని అనుసరించిన ప్రియా ఘంఝాన్స్ కెనడా బాక్సర్ మ్యారీ బతౌల్ను మట్టికరిపించింది. 60 కిలోల విభాగంలో పంచ్ల వర్షం కురిపించిన ప్రియ మూడో రౌండ్ ముగిసేసరికి 4-1తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. దాంతో, భారత్ ఖాతాలో పదో స్వర్ణం చేరింది. మరోవైపు జుడోకా ఉన్నాటి శర్మ కాంస్యం సాధించింది. మొత్తంగా ఇప్పటివరకూ గ్లాస్గోలో భారత్ 33 పతకాలు గెలిచింది.
#Breaking – Priya won the gold medal in the women’s 60 kg boxing final at the Commonwealth Games Glasgow 2026. pic.twitter.com/ypiDqgnJTq
— NEWS WALA (@NEWSWALApy) August 1, 2026