హైదరాబాద్ : హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ యువ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు అవకాశం దక్కడంపై తెలంగాణ గౌడ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆయనకు గౌడ సంఘం తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు. హిమాయత్నగర్లోని తెలంగాణ గౌడ సంఘం కార్యాలయంలో గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉద్యమ బిడ్డకు టికెట్ మంచి పరిణామమన్నారు.
గెల్లు గెలుపు కోసం గౌడ సంఘం కృషి చేస్తుందన్నారు. శ్రీనివాస్ యాదవ్కు టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్లు నాచగొని రాజయ్య, ప్రతాప లింగం గౌడ్, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములయ్య గౌడ్, జాతీయ కార్యదర్శి మిద్దెల మల్లేశం గౌడ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల పద్మా గౌడ్, సిటీ జనరల్ సెక్రెటరీ మందారం అనిల్ గౌడ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
భర్తను రోకలిబండతో బాది హత్య చేసిన భార్య
ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా : స్పీకర్ పోచారం
కోల్కతా కరోనా రోగుల్లో మూడోంతులు టీకా తీసుకున్న వారే
రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ