న్యూఢిల్లీ: 127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ మొదలైంది. ఈ బిల్లుకు మంగళవారం లోక్సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రాలకు ఓబీసీ కోటా విషయంలో అధికారులు ఇచ్చేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యసభలో చర్చ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన ప్రశ్నోత్తరాలు, భోజన విరామ సమయాన్ని రద్దు చేశారు. బిల్లును ఎవరూ వ్యతిరేకించడంలేదని, చర్చ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించినా ఇబ్బంది లేదని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. నాలుగు గంటల పాటు ఈ అంశంపై చర్చ చేపట్టనున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తెలిపారు. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్.. ఓబీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ చేప్టటేందుకు ఏకగ్రీవంగా అంగీకరించిన సభ్యులందరికీ ఆయన థ్యాంక్స్ తెలిపారు. ఇదో చరిత్రాత్మక బిల్లు అని ఆయన తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి బిల్లు ఊతమిస్తుందన్నారు.