నిర్మల్: కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ, కొవిడ్ వల్ల మరణించిన అటవీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరొసానిచ్చారు. విధినిర్వహణలో కొవిడ్ సోకి మరణించిన అటవీ ఉద్యోగులకు నిర్మల్ పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో మంత్రి నివాళులర్పించారు. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది రూ. 2.50 లక్షల నిధులు సేకరించారు. ఆ మొత్తాన్నిఒక్కో బాధిత కుటుంబానికి రూ.50 వేల చొప్పున అర్థిక సహాయాన్ని మంత్రి అందజేశారు. తోటి ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలిచి, వారికి ఆర్థికచేయూత నందించిన ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. అటవీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాన్ని సకాలంలో అందేలా చూస్తామన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి