హిసార్: కరోనా బారిన పడి మరణించిన వారి అంత్యక్రియలకు హాజరుకావటానికి కూడా జనం జంకుతున్న సమయమిది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన తన విధుల్లో భాగంగా.. దాదాపు 300 మందికి అంత్యక్రియలు జరిపించాడు. కానీ, చివరికి ఆయనే ఆ మహమ్మారికి బలయ్యాడు. హర్యానాలోని హిసార్కు చెందిన ప్రవీణ్కుమార్ (43) గాథ ఇది. హిసార్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ప్రవీణ్కుమార్ కరోనా బారిన పడి మరణించిన వారికి అంత్యక్రియలు నిర్వహించే బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు దాదాపు 300 మందికి ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. రెండు రోజుల కిందట ఆయనకు కరోనా సోకింది.