లక్నో: ఉత్తరప్రదేశ్లోని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే(BSP MLA) ఉమాశంకర్ సింగ్ మృతిచెందారు. రస్దా నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. యూపీ అసెంబ్లీ సామర్థ్యం 403 కాగా, దాంట్లో ఉమాశంకర్ ఒక్కరే బీఎస్పీ పార్టీకి చెందినవారు. బ్రెయిన్ ట్యూమర్కు ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం రాత్రి 8.30 నిమిషాలకు ఆయన ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ మృతి పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. బీఎస్పీ ప్రెసిడెంట్ మాయావతి కూడా ఎమ్మెల్యే మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. చికిత్స సమయంలో ఆయన కుమారుడితో నిత్యం టచ్లో ఉన్నట్లు ఆమె తెలిపారు. స్టూడెంట్ నేతగా తన ప్రజాజీవితాన్ని ఉమాశంకర్ మొదలుపెట్టాడు. బలియాలో ఉన్న సతీశ్ చంద్ర కాలేజీలో ఆయన స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా చేశారు. యూపీ అసెంబ్లీలోని రస్దా నియోజకవర్గం నుంచి 2012లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017, 2022 సంవత్సరాల్లోనూ ఆ స్థానాన్ని ఆయన చేజిక్కించుకున్నారు.