ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ)/వెంగళరావునగర్: ఆయుర్వేద మందులతో బ్లాక్ ఫంగస్ను నయం చేయవచ్చని ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి తెలిపారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల కరోనా బారినపడి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ అత్యంత ఆందోళన పెడుతున్న జబ్బుగా ఉన్నదని, దీనిని పూర్తిగా నయంచేసే శక్తి ఆయుర్వేద మందులకు ఉన్నదని చెప్పారు. వాస్తవానికి 500 ఏండ్లకు ముందు నుంచి ఇలాంటి లక్షణాలు ఉన్న జబ్బులకు ఆయుర్వేద వైద్యం ద్వారా లక్షల మందికి పూర్తిగా నయం అయిన ఘటనలు ఉన్నాయని అన్నారు. ఆయుర్వేద మందుల ద్వారా ప్రాణనష్టం లేకుండా కాపాడవచ్చన్నారు. ఇప్పటికే అనేకమంది ఈఎన్టీ దవాఖానలో చికిత్స పొందుతున్నారని, ప్రభుత్వం ఆయా దవాఖానల్లో ఆయుర్వేద మందులను అందజేస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా బ్లాక్ఫంగస్కు అల్లోపతి మందులు ఇప్పటికే తీసుకుంటున్నప్పటికీ ఈ ఆయుర్వేద మందులు కూడా వాడవచ్చని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఆయుర్వేద షాపుల్లో ఈ మందులు దొరుకుతాయని, ప్రభుత్వం వీటిని ఉచితంగా అందుబాటులోకి తేనున్నదని చెప్పారు. పలువురు సీనియర్ ఆయుర్వేద వైద్య నిపుణులు మాట్లాడుతూ.. కొవిడ్ సెకండ్ వేవ్లో వైరస్ లక్షణాల్లో ఆకలి చచ్చిపోతున్నదని, వాంతులు, విరోచనాలు అవుతున్నాయని అన్నారు. అలాంటి సమయంలో భయపడకుండా కొన్ని గంటలపాటు ఏమీ తినకుండా జావ, ఇతర ద్రవాలు తీసుకొని కొద్దిగా శక్తి వచ్చిన తర్వాత బలవర్ధకమైన ఆహారాన్ని తినాలని సూచించారు. స్టెరాయిడ్స్, యాంటిబయోటిక్స్ను తగ్గించడం వల్ల బ్లాక్ ఫంగస్ రాకుండా కాపాడుకోవచ్చని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ఆయుర్వేద అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ కే అనసూయ, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీకాంత్బాబు, దవాఖాన సూపరింటెండెంట్ రామచంద్రారెడ్డి, సీనియర్ వైద్యులు రమాదేవి, ఉమా శ్రీనివాసరావు, సురేశ్, శైలేష్నాథ్, ప్రవీణ్కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బ్లాక్ ఫంగస్కు
కరోనా చికిత్స పొందిన వారిలో తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న బ్లాక్ ఫంగస్ను నియంత్రించేందుకు ఆయుర్వేద వైద్యంలో పలు ఔషధాలు ఉన్నట్టు సంబంధిత విభాగాలు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ నివారణకు వాడాల్సిన మందులు, వాడే విధానాన్ని రెండురకాలుగా వివరించారు.