న్యూఢిల్లీ : కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ వారంలో కలెక్టర్లతో ప్రధాని సమావేశమవడం ఇది రెండో సారి. గత మంగళవారం 9 రాష్ట్రాలకు చెందిన 46 జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇవాళ జరిగే సమావేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి 9 జిల్లా కలెక్టర్లు పాల్గొనున్నారు. కోల్కతాకు కలెక్టర్ లేకపోవడంతో ఆ స్థానంలో కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినోద్ కుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. గత సమావేశంలో ప్రధాని మోడీ కరోనా కట్టడిలో కలెక్టర్ల సేవలను ప్రశంసించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.