హైదరాబాద్: నగర శివార్లలోని పెద్దఅంబర్పేట ఔటర్ రింగ్రోడ్డుపై కారులో మంటలు చెలరేగాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న స్విఫ్ట్ కారులో (టీఎస్ 08 హెచ్జే 2026) గంజాయి తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఔటర్ రింగ్రోడ్డుపైకి చేరుకోగానే అందులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో కారును వదిలేసిన దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. దీనిని గమనించి అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు మంటలను ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంజిన్ భాగంలో గంజాయి తరలిస్తుండంతోనే కారులో మంటలు అంటుకున్నాయని చెప్పారు. గంజాయి రవాణా చేస్తున్నవారికోసం పోలీసులు ఆరాతీస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..