న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. మద్యం షాపుల(Liquor shops)ను ముందుగానే మూసివేయాలని నిర్ణయించింది. రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులను తెరవనున్నట్లు అధికారులు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో లిక్కర్ షాపులకు చెందిన సమయాన్ని కుదిరించారు. గురువారం అకస్మాత్తుగా మద్యం షాపులను ఢిల్లీలో రాత్రి 8 గంటలకే మూసివేశారు. దీంతో లిక్కర్ కోసం జనం తికమకపడ్డారు. సాధారణంగా సిటీలో మద్యం షాపులను రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అయితే ఈ వారాంతం వరకు మద్యం షాపులను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. నీట్ పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం పార్లమెంట్ మార్చ్ సమయంలో హింస చోటుచేసుకున్నది. అనేక మంది విద్యార్థులు లాఠీ దెబ్బలు తిననారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు.