స్టేట్ ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ రామకృష్ణారావు
గజ్వేల్ అర్బన్, ఏప్రిల్ 4: సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ దేశానికి మోడల్గా నిలుస్తుందని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను సీఎం కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఆదివారం ఆయన సమీకృత మార్కెట్ను సందర్శించారు. మార్కెట్ నిర్మాణం, నిర్వహణ గురించి ఆయనకు కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ వివరించారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించాలి
అగ్రకులాల పేదలు అభివృద్ధి చెందాలి