నిజామాబాద్: గోదావరి నదికి క్రమంగా వరద పెరుగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో నదిలోకి నీరు వచ్చిచేరుతున్నది. దీంతో జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. జలాశయంలో ప్రస్తుతం 1069 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు నీటినిల్వ 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 30 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 11.95 టీఎంసీల నీరు చేరింది.