NTA : ప్రశ్నాపత్రాల లీకేజీ (Paper Leaks), పరీక్షల్లో అవకతవకల (Exam frauds) పై కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) కీలక చర్యలు చేపట్టింది. పరీక్షా విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేసే చర్యల్లో భాగంగా 50 మందికిపైగా సిబ్బందిని తొలగించింది. సంస్థలోని కీలక స్థానాల్లో నిపుణులను నియమిస్తున్నది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ (Union Education Ministry) ప్రకటన వెలువరించింది. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ వంటి పది కొత్త స్థానాల కోసం ప్రకటనలు జారీచేసి, నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది.
సైబర్ భద్రత, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక విభాగాల కోసం ప్రైవేట్ రంగం నుంచి కూడా నిపుణులను తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. నిర్దేశిత పరీక్షా విధానాలను కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారులను ఆదేశించారు. ప్రశ్నపత్రాల గోప్యతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక గదులు, ఎయిర్-గ్యాప్డ్ సిస్టమ్స్ (ఇంటర్నెట్తో సంబంధం లేని వ్యవస్థలు), పరికరాలను భద్రపరిచే విధానాలను పూర్తిగా పునర్ వ్యవస్థీకరించాలని పేర్కొన్నది.
అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, నివేదిక సమర్పించాలని ఎన్టీఏను ఆదేశించారు. సోమవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి.. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సహా ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.