Harish Rao | హైదరాబాద్ : రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. పంటల రుణమాఫీ విషయంలో ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారింది అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతున్నది. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే. ఎన్నికలప్పుడు మభ్య పెట్టారు, అధికారం చేజిక్కించుకున్న తర్వాత ఆంక్షలు పెట్టారు అని హరీశ్రావు మండిపడ్డారు.
1. తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుంది.
2. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది.
3. తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు.. వాటి బ్రాంచ్ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
4. 12.12.2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09.12.2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.
5. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం రూ. 2 లక్షల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09.12.2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు, వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది.
5. రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు(రేషన్ కార్డు) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి అట్టి కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు మున్నగు వారు ఉంటారు.
6. అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్దిదారుల రైతు రుణఖాతాలకు జమ చేయబడుతుంది. పీఏసీఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పీఏసీఎస్లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు.
7. ప్రతి రైతు కుటుంబానికి 09.12.2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలి.
8. ప్రతి రైతు కుటుంబానికి 09.12.2023 నాటికి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక రూ. 2 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది.
9. ఏ కుటుంబానికి అయితే రూ. 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు రూ. 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకులకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హత గల రూ. 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు.
10. రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి.
ఇవి కూడా చదవండి..
Telangana | ఢిల్లీలో తెలంగాణ నిరుద్యోగుల దీక్షకు అనుమతి కోరిన మోతీలాల్ నాయక్
TGEAPCET | టీజీఎప్సెట్ ఫస్ట్ ఫేజ్.. వెబ్ ఆప్షన్ల నమోదుకు మరో రెండు రోజులు గడువు పొడిగింపు
Telangana | రీషెడ్యూల్ రుణాలకు రుణమాఫీ వర్తించదు.. కీలకమైన మార్గదర్శకాలివే..!
Telangana | పంటల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.. రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్ కార్డు ప్రామాణికం
KTR | మ్యాటర్ వీక్ ఉన్నప్పుడే.. ప్రచారం పీక్లో ఉంటుంది.. రేవంత్పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు