నల్గొండ: జిల్లాలోని నేరుడుగొమ్ము మండలంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న దంపతులను దుండగులు దారుణంగా నరికేశారు. మండలంలోని బుగ్గతండాకు చెందిన బుల్లి, నేనావత్ సోమాని.. భార్యభర్తలు. ఆదివారం రాత్రి వారు తమ ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిని హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా, దంపతుల హత్యకు భూవివాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..