న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: కరోనా కట్టడికి వ్యాక్సిన్ చాలా కీలకమని, దేశంలో వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సూచించారు. కరోనా నియంత్రణకు పలు సూచనలు చేస్తూ ఆయన ఆదివారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఎంత మందికి టీకా వేశాం అన్నది కాకుండా జనాభాలో ఎంత శాతం మందికి టీకా చేరిందన్నది ముఖ్యమని అన్నారు. దేశంలో జనాభాను బట్టి ప్రస్తుతం చాలా తక్కువ మంది టీకా వేసుకొన్నారని మన్మోహన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తన సూచనలను పరిగణనలోకి తీసుకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.