మాగనూరు : ఉపాధ్యాయ( Teachers ) ,విద్యారంగ ( Students ) సమస్యల సాధన కోసం ఆగస్టు 1న తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( TAPAS ) ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాగనూరు మండల అధ్యక్షులు బాబురెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో జరిగిన శిక్షణ కేంద్రం వద్ద మహాధర్నా గోడప్రతులను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న సమస్యల సాధన కోసం అనేకసార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే దశల వారి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యాయమని వెల్లడించారు. ప్రభుత్వ వెంటనే పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ విధానం రద్దు పరిచి పాత పెన్షన్ అమలు చేయాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గణేష్ సింగ్, మండల ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, జిల్లా నాయకులు వెంకట్రాములు,
తపస్ జిల్లా మండల బాధ్యులు పాల్గొన్నారు.