నువ్వు ఏ మంత్రం వేశావో గాని
నా కంటి మీద కునుకు కరువైంది
నువ్వు ఏ మాటల మత్తును ఇచ్చావో గానీ
నా మనసు కడలిలో అలలు రేగుతూనే ఉన్నాయి
నువ్వు నా పెయ్యిని ఎక్కడ తాకావో గానీ
నా తనువంతా తామరమై వికసిస్తుంది
కోపం తగది కొడుకా!
కోపగించుకుంట వోతుంటె ఎవలు దగ్గరైతరు?
గుడ్లు దీసుడు..పండ్లు గొర్కుడు..
మీది మీది కచ్చుడు ఎందుకు మంచిదంటవు?
ఎంత ఉర్మి ఉర్మి జూసినా
మాటకు భయపడే కాలం ఎక్కడిది?
మాట అన్నప్పుడు మాట వడాల్సిందే!
ఈ అనుమానాలు కొంతకాలం క్రితం మొదలై ఇటీవల క్రమంగా వ్యాపిస్తున్న స్థితి నుంచి ఏర్పడిందే ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’. అనేక మేథోమథనాల ఫలితంగా ఉనికిలోకి వచ్చిన ‘వేదిక’ తొలి ప్రచురణ ‘తెలంగాణ అస్తిత్వం’. వే
సారు కొన్ని నవ్వులు
మా గుడిసెలకు కూడా ఇయ్యండి
ఎంతకాలం ఈ చీకట్లో బతుకమంటారు
ఎన్నో ఏండ్ల నుంచి దుఃఖపు నీళ్లలో
తడుస్తూ ఉన్నాము
బీదరికపు ముళ్లతో సావాసం చేస్తున్నాము
సినారె లకుమ కర్పూర వసంతరాయలు కావ్యం లోనిది. ఇదొక కథాకావ్యం. ఈ కావ్యం ఆయన 1957లో రాశారు. ఇందులో ముఖ్యపాత్ర లకుమ. లకుమ తెలుగు సాహిత్యంలో విలక్షణమైన కావ్యనాయిక. ఇది చారిత్రాత్మకమైన పరిస్థితుల నేపథ్యంలో రాసిన క�
రాత్రి కొండచిలువను దాటుకుని
ముందుకు వెళుతుంటే పసుపు పచ్చని పూలు పర్చుకుని స్వాగతం పలుకుతూ..చల్లని గాలి కెరటాలు ఇరువైపుల తాకుతూ దేహాన్ని దూది పింజను చేసి ప్రకృతిలోకి విసురుతున్న వైనం
అర్ధరాత్రి నిశ్శబ్దంలో
మనసు తలుపు మెల్లగా
తెరుచుకుంటుంది
అది సిమెంటు ఇటుకలతో
కట్టిన భవనం కాదు
జ్ఞాపకాలతో కట్టిన
అంతర్ముఖ ప్రాంగణం
అక్కడ ఒక పుస్తకాల
బీరువా కనబడుతుంది
దాంట్లో వందలకొద్దీ
దుమ్మూ ధూళి