నోముల నర్సింహయ్యకు అశ్రునివాళి

కోదాడటౌన్/మేళ్లచెర్వు/హుజూర్నగర్ రూరల్: ప్రజాసేవ కోసం పరితపించిన నేత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అని పట్టణ యాదవ సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నోముల చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన మృతి టీఆర్ఎస్ పార్టీకి, పేదలకు తీరని లోటని పేర్కొన్నారు. అలాగే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నర్సింహయ్యకు నివాళులర్పించారు. నోముల మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి కలుగాలని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు ప్రార్థించారు. నర్సింహయ్య మృతి బాధాకరమని టీఆర్ఎస్ మేళ్లచెర్వు మండలాధ్యక్షుడు సూరిశెట్టి బసవయ్య పేర్కొన్నారు. నోముల తన జీవితాంతం అణగారిన వర్గాల కోసం పనిచేశారని హుజూర్నగర్ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నోముల చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో కట్టెబోయిన శ్రీనివాస్యాదవ్, ఈదుల కృష్ణయ్య, గుండెల సూర్యనారాయణ, దేవబత్తిని నాగార్జున్రావు, సుధాకర్రెడ్డి, రాధాకృష్ణమూర్తి, మేకల వెంకట్రావ్, ఉయ్యాల నర్సయ్య, ఇమాం, చావా వీరభద్రారావు, అబ్దుల్ నబీ, అంజిరెడ్డి, నరేశ్, నారపరెడ్డి, రాజేశ్, ఓంకార్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- బోయిన్పల్లి కిడ్నాప్ కేసు.. విచారణ వేగవంతం
- శృతిహాసన్, అమలాపాల్..బోల్డ్గా 'పిట్టకథలు' టీజర్
- ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగింపు
- చరిత్రలో ఈరోజు.. అణు రియాక్టర్ 'అప్సర' ప్రారంభం
- నందిగ్రామ్ నుంచే సువేందు అధికారి పోటీ!
- బాత్రూమ్ కి వెళ్తే..ఉద్యోగం ఫట్
- ఇండ్ల నిర్మాణం కోసం రూ.2,691 కోట్లు విడుదల చేసిన ప్రధాని
- చివరి రోజు.. 73 మందికి క్షమాభిక్ష పెట్టిన ట్రంప్
- లక్షద్వీప్లో కరోనా అలజడి.. అప్రమత్తమైన కేంద్రం
- ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఎయిర్మెన్ పోస్టులు